ఎప్పుడు కూలుతుందో తెలియదు.. కాంగ్రెస్పై రాజాసింగ్ కామెంట్స్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై MLA రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియక నేతలు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, నేతలు, అధికారులు అనే తేడా లేకుండా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి CM అయ్యాక కూడా అవినీతి ఆగలేదన్నారు. నేతల మధ్య డబ్బుల వాటాల వ్యవహారం దిల్లీ పెద్దలకు కూడా తెలుసని చెప్పారు. ఈ ఇష్యూనే మంత్రి కొండా సురేఖ రాజీనామా వరకు వెళ్లిందని రాజాసింగ్ అన్నారు.



