తన ఆత్మహత్యపై తానే ఫేక్ న్యూస్.. అసలు ట్విస్ట్ ఇదే!

AP: తాను కూడా న్యూస్లో కనిపించాలనే ఉద్దేశంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాడు. ఒంగోలులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న, ప్రకాశం జిల్లా, మర్రిపూడి యువకుడు.. తన ఫొటో, పేరు, ఊరుతో పాటూ కాలేజీ హాస్టల్లో ఘటన జరిగినట్లు సూసైడ్ నోట్ రాశాడు. వినాయకచవితి సమయంలో ఈ ఫేక్ న్యూస్.. యూట్యూబ్, FBలో వైరల్ అయింది. కాలేజ్, హాస్టళ్లలో పోలీసులు సెర్చ్ చేశారు. చివరికి అతన్ని పట్టుకుని ఎంక్వైరీ చేయగా నిజం బయటపడింది. ఇలాంటివి చెయ్యొద్దని పోలీసులు సూచించారు.


