అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు పొడిగింపు..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. శనివారం సభా కార్యక్రమాల అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీని ఈనెల 16కి వాయిదా వేశారు. ఆ రోజు CM రేవంత్ రెడ్డి 22-A పై సభలో మాట్లాడనున్నారు. ఈ అంశంపై CM వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో చర్చకు ప్రాధాన్యం దక్కింది. 22-A సమస్యపై రైతులు ఆందోళన చేస్తున్నారు. సభలో ఏం జరుగుతుందో చూడాలి..!



