పెరిగిన ధరలు తగ్గించాలి.. సత్తుపల్లిలో ఆందోళన

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బుధవారం నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆరోపించారు. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.



