కేసుల దర్యాప్తు వేగవంతం

TG : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసుల ఇన్వెస్టిగేషన్ నుంచి తీర్పు వరకు ప్రతి పనినీ టైమ్కి పూర్తి చేయాలని సీపీ అంబర్ కిశోర్ అధికారులను ఆదేశించారు. కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షులను కోర్టులో హాజరుపరచడం, కాగితాల పరిశీలన, సీసీటీఎన్ఎస్ అప్డేట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిజాయితీగా, నీతిగా ఉంటూ ఆధారాలతో సమన్వయంగా పనిచేస్తేనే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.




