కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ సమరశంఖం

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు భీమదేవరపల్లి మండలం నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.



