← Back to news

రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!

By rajaratnam· 2d ago
రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వీరమ్మ కాలవ సమీప హైవేపై ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నారు. కొండమోడు నుంచి నకరికల్లు వైపు వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మీకు ఈ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయండి. ఇలాంటి హఠాత్ మరణం ఎంత బాధాకరమో కదా?

More in Local