బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా భక్తుల రద్దీ భారీగా తగ్గింది తగ్గింది. కంపార్టుమెంట్లలో వెయిటింగ్ లేకుండానే భక్తులను నేరుగా క్యూలైన్లలోకి క్యూలోకి పంపిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి, రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని TTD తెలిపింది. సోమవారం 88,210 మంది శ్రీవారిని దర్శించుకోగా, 30,192 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది.