మంత్రులు ఎందుకు తప్పించుకుంటున్నారు?: మల్లికార్జున ఖర్గే
‘దేశంలోని 140 కోట్ల ప్రజలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాం. హోం మంత్రి, ప్రధాన మంత్రి హౌస్కు రావాలని కోరుతున్నాం. ఛైర్ హోం మంత్రిని స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించాలని కోరుతున్నాం. చర్చకు మేము సిద్ధం. అయినా నిజమైన ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటోంది’ అని కాంగ్రెస్ పార్లమెంట్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘డిస్రప్షన్ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో భాగమే’ అని గతంలో బీజేపీ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.


