1950 రాష్ట్రపతి ఉత్తర్వు 341 సవరించాలి..!

వనపర్తి జిల్లాలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సభ జరిగింది. ఎనుముల ఉసెన్ 7వ వర్ధంతి, పెరుమళ్ళ ప్రణయ్ 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవన్లో సభ జరిగింది. మతం మారిన దళితులకు SC హోదా, రిజర్వేషన్లు రద్దవుతాయని సుప్రీంకోర్టు చెప్పడం ఆందోళనకరమన్నారు. ఈ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్లకు SC హోదా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు 341 సవరించాలని కోరారు.