పల్నాడులో YCP కి షాక్! చైర్మన్ సహా 7 కౌన్సిలర్లు TDP లో
పల్నాడు జిల్లా గురజాల మున్సిపాలిటీలో రాజకీయ మార్పులు జరిగాయి. పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బడే జానీతో పాటు ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్బై చెప్పారు. వారికి టీడీపీ కండువాలు కప్పి ఎమ్మెల్యే యరపతినేని, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందని, అదే కారణంతో వైసీపీని వీడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. గురజాల మండలంలో పలు కుటుంబాలు కూడా టీడీపీలో చేరినట్లు సమాచారం.దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.



