సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన

వరి పంటలో పురుగుల నివారణకు ప్రకృతి ఆధారిత పద్ధతులు, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునాపురంలో ఆదర్శ రైతు బుడ్డెపు కామేష్రెడ్డి పొలాల్లో ఆకర్షణ బుట్టలు, ఆకర్షణ గమ్ ప్లేట్లు, పక్షుల స్టాండ్లను ఏర్పాటు చేశారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో భాగంగా రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి పురుగులను సహజ పద్ధతుల్లో నియంత్రించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయ సిబ్బంది సమన్వయకర్తలు శివానందం, జయలక్ష్మి, సిబ్బంది, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
