కంజరి తోటలో మంచినీటి కష్టాలు.. జ్వరాలు విజృంభణ!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కీ పంచాయతీ కంజరి తోట గ్రామంలో రెండు నెలలుగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు. గ్రామస్థులు బురద నీళ్లు తాగుతున్నారు. దీంతో రెండు వారాలుగా ప్రతి ఇంట్లో జ్వరాలు వస్తున్నాయి. జల్ జీవన్ బోరు, మోటార్ పనులు పూర్తి కాలేదు. గ్రామస్థులు సింహాద్రి, కొండలరావు తక్షణమే మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అధికారులు వెంటనే స్పందించాలి. మీ ఊరిలో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి!

