← Back to news

దోమల నివారణకు ముమ్మర చర్యలు

By VEMANNA JAY· 3d ago
దోమల నివారణకు ముమ్మర చర్యలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గోర్లఖాన్‌ దొడ్డిలో దోమల నివారణకు పంచాయతీ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్‌ యు. సేకమ్మ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని వార్డులు, మురికి కాలువలు, ప్రధాన వీధుల్లో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తితో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

More in Local