పటాన్చెరులో మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్

సంగారెడ్డి జిల్లాలో పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు న్యూ మార్కెట్ వద్ద ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వరుసగా 11వ సంవత్సరం నిర్వహించిన ఈ ఈవెంట్కి జనాలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ విగ్రహాలు అందించారు. పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుతూ అందరికీ విషెస్ చెప్పారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

