← Back to news

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన

By Rajkumar Kotha· 16 Aug 2026· సిద్దిపేట జిల్లా
పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన

TG: కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల అమలుపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local