← Back to news

కేకే కమిటీని కలవనున్న ముంబై నాయకులు

By Mulnivasi· 1h ago· Nizamabad
కేకే కమిటీని కలవనున్న ముంబై నాయకులు

తెలంగాణ సాధనలో ముంబై వాసుల పాత్ర గొప్పదని ముంబై కూర్మ సంఘం అధ్యక్షుడు జూకంటి రామచందర్ అన్నారు. నాడు చంద్రబాబుకు నల్ల జెండాలు చూపి తమ ఆకాంక్షను ప్రపంచానికి చాటామని చెప్పారు. ముంబై ఉద్యమకారులను కేకే కమిటీ గుర్తించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే హైదరాబాద్ వెళ్లి కేకే కమిటీని కలవనున్నట్లు ఎంటీజేఏసీ కో-కన్వీనర్ లక్ష్మణ్ మహరాజ్ తెలిపారు.

More in Local