ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

TG: రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మంచిర్యాల సబ్ కలెక్టర్ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



