జగిత్యాలలో భారీ ధర్నా

TG : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.14 వేల కోట్లు వెంటనే రీలీజ్ చేయాలని జగిత్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. వారం క్రితం కలెక్టర్కు పిటిషన్ ఇచ్చిన స్పందన లేకపోవడంతో నిరసన చేపట్టారు. గవర్నమెంట్ వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రొటెస్ట్లో జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ లీడర్లతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



