రూ.20 లక్షలు.. డ్రైనేజీ పనులు మాత్రం జీరో!
జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు! కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఓ ఇంటి యజమాని తన ఇంటి ముందు సొంత డబ్బులతో డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. ’’డబ్బు మంజూరైనా పనులు ఎందుకు చేస్తలేరు. ఎందుకింత నిర్లక్ష్యం? నేను టాక్సు కట్టను. అప్పుడు నన్ను ఏమీ అనరు కదా’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? వీడియో తీయండి. పంపండి.



