ఉచిత బస్సుల కోసం రూ.12 వేల కోట్లు
TG: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. KPHB కాలనీలో జరిగిన ‘ఇందిరమ్మ ఇండ్లు’ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదీ ఉచితంగా ఇవ్వడం లేదని అన్నారు. మహిళల టికెట్ చార్జీల కోసం RTCకి రూ.12 వేల కోట్లు ప్రభుత్వం స్పెండ్ చేస్తుందని తెలిపారు. మహిళలు ఫ్రీగా ప్రయాణించడం వెనుక ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.


