30 ఏళ్ల కల సాకారం.. కృష్ణమ్మ పరుగులు పెట్టింది!

30 ఏళ్ల కల సాకారమైంది. ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద సోమవారం సీఎం చంద్రబాబు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించారు. కృష్ణా జలాలు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు చేరాయి. తొలి దశలోనే 10.70 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు ఈ ప్రాజెక్ట్ వరం. ప్రకాశం జిల్లాలోనే 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరులో 84,000 ఎకరాలు, కడపలో 27,200 ఎకరాలు సాగవుతాయి.




