APWJF జిల్లా సహాయ కార్యదర్శిగా తిరుపతి..!

విజయనగరం జిల్లాలో APWJF 6వ మహాసభ ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో కొత్త జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రాజాం నియోజకవర్గ జర్నలిస్ట్ అమరాన తిరుపతి జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. జర్నలిస్టుల ఇష్యూస్ పరిష్కారం, హక్కుల ప్రొటెక్షన్ కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. యూనియన్ను మరింత స్ట్రాంగ్ చేస్తానని చెప్పారు. ఈ నియామకంపై రాజాం జర్నలిస్టులు అన్నారావు, ప్రసాద్, దుర్గారావు, మహేష్, జనార్దన్, రాంబాబు, ప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు.
