← Back to news

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం

By dk· 16 Aug 2026· సిద్దిపేట జిల్లా
నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం

TG: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన భీమదేవరపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ బస్టాండ్ సమీపంలోని సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం బాషా (65) బిందెలు, బకెట్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం అక్కడికి వచ్చిన ఆయన నీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా, కూలీలతో దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

More in Local