కోటిలింగాల డెవలప్మెంట్ స్టార్ట్..!
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలో పార్వతి కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 2027 గోదావరి పుష్కరాల కోసం ఈ పనులు చేపట్టారు. కొత్త ఆలయం కోసం రూ.4.50 కోట్లు, రాజగోపురం కోసం రూ.1 కోటి మంజూరయ్యాయి. పాత శిఖరాలను మెషిన్స్ తో తొలగిస్తున్నారు. ఫండ్స్ మంజూరు చేయించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి EO కాంతారెడ్డి, చైర్మన్ పుదరి రమేష్, ధర్మకర్తలు థాంక్స్ చెప్పారు.



