సీతక్కా.. మాకు గుర్తింపు కావాలి!

మంత్రి సీతక్క మంగళవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు వచ్చారు. ఎన్టీజేఏసీ విజ్ఞప్తి పత్రం అందజేసింది. ముంబై, భివండి, నవీ ముంబై, సూరత్లోని తెలంగాణ ఉద్యమకారులకు కెకె కమిటీ గుర్తింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో తాము క్రియాశీల పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమన్వయకర్తలు బట్టు శ్రీధర్ గంగపుత్ర, సామ్రాట్ అశోక్, ఎం. మాలజీ ఉన్నారు.




