← Back to news

Sept 17న TRP చైతన్యయాత్ర

By Siddu· 1h ago· Bhirampalle, Kondurg, Ranga Reddy
Sept 17న TRP చైతన్యయాత్ర

హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా చైతన్య యాత్ర సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి మొదలవుతుంది. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఈ పాదయాత్ర జరుగుతుంది. బహుజనుల రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని పార్టీ చెబుతోంది. షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరింది. జిల్లా ప్రతినిధి భూస జంగన్న మాట్లాడుతూ.. ప్రజలు చైతన్యం వైపు పయనించాలని, పోరాటంలో అందరం తోడుగా నిలుద్దాం అని ఆయన అన్నారు.

More in Local