← Back to news

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

By Saraswathi Rao B· 5h ago· Ambedkar Konaseema
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం శివారులోని ONGC సైట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి లక్కవరం తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ముదునూరి రామభద్ర రాజు, ఆయన తమ్ముడు ముదునూరి వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి ఇద్దరు భార్యలకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో లక్కవరం గ్రామంలో విషాదం నెలకొంది.

More in Local