గురజాలలో పత్తి పంటలకు నీటి కష్టం
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో పత్తి పంటలు ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందే పరిస్థితి లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు. పత్తి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ నుంచి కొంతమేర సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



