← Back to news

ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం

By Dee kay· 18 Jun 2026· Dishadaily· చిత్తూరు జిల్లా
ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగులు మామిడితోటలపై దాడి చేశాయి. రాత్రి వేళల్లో పంటలు, మామిడి తోటలలోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం మండలంలో, అదేవిధంగా ననియాల, ఎస్ గొల్లపల్లి ప్రాంతాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగుల కదలికలపై అధికారులు నిఘా పెంచారు.

More in Local