నీళ్లొచ్చాయ్.. కానీ కళ్లలో కన్నీళ్లే!
వెలిగొండ ట్రయల్ రన్తో కల్నూతలకు నీళ్లొచ్చాయి. కానీ ఆ గ్రామస్తుల కళ్లలో ఆనందం లేదు. ఎందుకంటే వారి గ్రామంతో పాటు మరో 10 గ్రామాలు మునిగిపోతున్నాయి. సుమారు 7500 ఫ్యామిలీస్ ఇల్లు, ఊరు వదిలి వెళ్లాలి. ''భూమిలేదు. ఇల్లులేదు. ఇంకా 1000 మంది పేర్లు ప్యాకేజీలో చేరాలి. పోనీ పునరావస ఊళ్లకు పోతే అక్కడ రోడ్లు లేవు. తాగునీళ్లు లేవు. 18 yrs వారికి రూ.2 లక్షలు, వంశధారలో 18 yrs వారికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. అవి ఎప్పుడొస్తవో తెల్వదు. మాకు త్యాగమనే బిరుదిచ్చారు. కానీ బతుకు బజార్న పడ్డది''.. ఇదీ నిర్వాసితుల ఘోష!



