← Back to news

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం

By naveed mohd· 2d ago
నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలం రైతుఫామ్‌ శివారులో పోలీసులు, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు భారీ రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఎస్సై కె. వినయ్‌కు సమాచారం అందడంతో వాహనాల తనిఖీలు చేపట్టగా, AP25X9971 నంబర్‌ గల మహీంద్రా బొలేరోలో 48 సంచుల్లో 22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు. దీని విలువ సుమారు రూ.1,12,548. రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తోలుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియలేదు. ఇది పేదల పొట్ట మీద కొద్దిమంది పందికొక్కుల చేసే దాడి.

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం
నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం

More in Local