డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై విచారణ అవసరం

మందమర్రి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్మం, చిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ మాట్లాడుతూ జాబితాలో అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. జాబితాలో మొదట 447 ఇళ్ల వివరాలు ఉండగా, ఒక్కరోజులోనే అర్హుల సంఖ్య 491కి పెరగడంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.



