పరిహారం కాజేస్తారు..అప్రమత్తంగా ఉండండి

AP: పోలవరం ప్రాజెక్టులో పరిహారం పొందిన నిర్వాసితులు మధ్యవర్తులు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ సూచించారు. కొంతమంది గ్రామాల్లోని ప్రభావిత కుటుంబాలను సంప్రదించి, వారికి అందిన పరిహారంపై అధిక వడ్డీ ఇస్తామని హామీ ఇస్తూ మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని సంస్థలు, అధిక వడ్డీకి రుణాలు ఇచ్చే వ్యక్తులు, అనుమానాస్పద పెట్టుబడి పథకాల ద్వారా నిర్వాసితులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.



