నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొరొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ బోల్తా పడింది. హైవేపై అడ్డంగా వాహనం పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రెండు క్రేన్లతో కంటైనర్ను పక్కకు తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో కైతాపురం నుంచి బొర్రాల్లగూడెం స్టేజ్ వరకు వాహనాలను పంపిస్తున్నారు.



