వైఎస్ వర్ధంతి.. గోకవరంలో ఘన నివాళులు!

తూ.గో. జిల్లా గోకవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి జలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భవిత సెంటర్లో దివ్యాంగ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. వీరబాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం వైఎస్ అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదలకు మేలు చేసిందని అన్నారు. వైఎస్సార్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



