కాల్వలో చెత్త, దోమల బెడద.. వార్డు ప్రజల అవస్థలు

TG: మురుగునీరు, చెత్తాచెదారంతో కాలువ నిండిపోవడంతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలోని ఎస్సీ వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రంగా మారింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో మురికినీటి కాలువ అధ్వానంగా తయారై దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోయారు.




