పాల సేకరణ ధరలు పెంపు

భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు డెయిరీ సభ్యులకు పాల సేకరణ ధరలను పెంచుతూ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు రేపు ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జనరల్ మేనేజర్ మార్పటి భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవు పాలకు లీటరుకు రూ.1.25, గేదె పాలకు లీటరుకు రూ.3.50 చొప్పున ధర పెంచినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు.



