తాడేపల్లిలో గంజాయి వేట..! 3 మంది అరెస్ట్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఛానల్ లాకుల వద్ద విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి చేతిలో 3.3 KG గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS Act కింద కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. "ఇంకా ఎంతమంది ఇలాంటి వ్యాపారం చేస్తున్నారో" అని తాడేపల్లి వాసులు ఆందోళన పడుతున్నారు.



