← Back to news

నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం

By DK· 2d ago
నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం

TG: పేరుకే నేషనల్ హైవే, గుంతలతో ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణ సమయం భారీగా పెరిగింది. గతంలో గంట పది నిమిషాల్లో చేరే మార్గంలో ప్రస్తుతం రెండుగంటల వరకు పడుతోంది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుష్టి గ్రామం వద్ద వంతెనపై భారీ గుంత ఏర్పడటంతో ఒకవైపు మాత్రమే వాహనాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది.

More in Local