← Back to news

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చిరుత కలకలం

By DK· 27 Jun 2026· రంగారెడ్డి జిల్లా
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చిరుత కలకలం

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని చిన్మయ విద్యాలయ పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాఠశాల సమీపంలో చిరుతను గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పరిసరాలను పరిశీలించి చిరుత ఆనవాళ్ల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

More in Local