డిజిటల్ అరెస్ట్.. ఎస్పీ రోహిత్ హెచ్చరిక!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. అబ్దుల్ కలాం కళాశాలలో SP రోహిత్ రాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. OTPలు, ఫోటోలు, వ్యక్తిగత వివరాలు అపరిచితులకు పంచుకోవద్దని స్పష్టం చేశారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని, సినిమాల చెడు ప్రభావాలను అనుకరించవద్దని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.





