నిత్యావసరాల ధరలు తగ్గించాలి

నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కూలి పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.



