డప్పు చప్పుళ్ల మధ్య కొందుర్గులో గణనాథుడి ఆగమనం

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీ ఉమా మహేశ్వర కాలనీలో గణేష్ ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ నృత్యాలు, గణేష్ మహారాజ్ నినాదాల మధ్య వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా మండపానికి తరలించి ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో కాలనీ యువత, యూత్ సభ్యులు, భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుడి ఆగమనంతో కొందుర్గులో పండుగ సందడి నెలకొంది. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

