← Back to news

ఏడు ప్రైవేట్‌ స్కూల్స్‌కు రూ.లక్ష ఫైన్.. ఎందుకంటే?

By Mahesh· 7 Aug 2026· Noida
ఏడు ప్రైవేట్‌ స్కూల్స్‌కు రూ.లక్ష ఫైన్.. ఎందుకంటే?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలో ఫీజు రెగ్యులేషన్స్ పాటించని ఏడు స్కూల్స్‌పై గౌతమ్‌బుద్ధనగర్‌ జిల్లా అధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఒక్కో స్కూల్స్‌కు రూ.లక్ష ఫైన్ వేశారు. ఇందులో అపీజయ్‌, స్పర్శ్‌ గ్లోబల్‌, రామగ్యా, విశ్వభారతి, సెయింట్‌ జాన్స్‌, బాల భారతి పబ్లిక్‌, శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ ఉన్నాయి. 2026–27 అకాడమిక్ ఇయర్లో 6 స్కూల్స్ లిమిట్‌కు మించి ఫీజులు పెంచినట్లు అధికారులు గుర్తించారు. బాల భారతి పబ్లిక్‌ స్కూల్‌ ఫీజును వసూలు చేయడంతో పాటు, ఫీజు వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టలేదని తెలిపారు.

More in News