డ్రగ్స్కు దూరంగా ఉంటేనే భవిష్యత్తు

డ్రగ్స్కు దూరంగా ఉంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రొఫెసర్ సామ రవీందర్ రెడ్డి అన్నారు. షాద్నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ విశ్వనాథ్, లెక్చరర్ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.



