డ్రగ్స్కు ‘నో’ చెప్పే నేర్పు నేర్చుకోండి!

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 1న డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ, రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తే మొహమాటానికి పోకుండా ధైర్యంగా నో చెప్పండి" అని సూచించారు."ఒక్కసారి తీసుకుంటే ఏమీ కాదు" అనే ఆలోచనే ప్రమాదమని, అది ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.



