గంజాయి నిందితుల అరెస్ట్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మొగులయ్య మాట్లాడుతూ మల్దకల్ మండలం విటలాపురం, ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామాలకు చెందిన గోకారి, బీసన్న పంటపొలాల్లో గంజాయి మొక్కలను సాగు చేసి, వాటిని ఎండబెట్టి గంజాయిగా తయారు చేసి అమ్కుతున్నారని తెలిపారు. వాళ్ల బండ్లు తనిఖీ చేసి రూ.6 లక్షల విలువ చేసే 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.




