← Back to news

నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

By A VIJAY KUMAR· 2d ago· Warangal

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ రోడ్డు జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.

More in Local