మొహరం ఉత్సవంలో అపశృతి
TG: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నిర్వహించిన మొహరం ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సవారి బంగ్లా ప్రారంభోత్సవం సందర్భంగా టపాసులు కాల్చడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు సవారిపై ఉన్న కాగితపు పూలకు తాకి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పీర్లను కిందపడేసి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సవారిపై ఉన్న వస్త్రాలు దగ్ధమయ్యాయి.



